Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 173-3
సంపుటము: 2-358
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
హరిహరి నీమహిమ లనంతములు
విరతి జీవులకెల్ల నేరుపులై వున్నవి
॥పల్లవి॥
యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి
అందరికిఁ దమతమదై వుండును
కందువ నెవ్వరెవ్వరి కాణాచి యైనదో భూమి
సందడించీఁ బంటలను సకలసస్యములు
॥హరి॥
చుట్టుక యం(యెం)దరికిని సొమ్మయినదో కాలము
అట్టె అందరి ఆయుష్యమై యున్నది
గట్టిగా నెవ్వరెవ్వరి కంచము కూడో యీమాయ
దట్టపు సంసారముల ధర్మములై యున్నవి
॥హరి॥
ముంచి యం(యెం)దరికై నాను మోపులై వుండీ కర్మము
పంచు కందరికిఁ దమ పనిపాటలై
పంచుక శ్రీవేంకటేశ వారివారి బ్రదుకులు
నించి నీవే యైతివి నిధినిధానమవై
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము