| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు గోవుల మహానుభావంబు విని పాండవాగ్రజుండు భీష్మునితో ‘ధర్మంబులు తేటపడ ననుగ్రహించుచుం బుయిలోట వాపి నన్నుం గలిపికొని కృపకు భాజనంబుగాఁ జేయుటం జేసి కొంకక యింకను నడిగెదఁ; దాత్పర్యంబున ననుష్ఠింపవలయునవి యెయ్యవి యెఱింగింపవే!’ యనుటయు నతనితో నతండు. | 002 |
| సీ. |
‘విను నియమంబును వేదపాఠంబుఁ ద | ద్ధరణంబు దమము నధ్యాపనంబు నప్రతిగ్రహమును నాత్మీయకర్మని | ష్ఠయు సకలేంద్రియ జయము సత్య నిరతియు శ్రుతదాన పరతయు బ్రహ్మ చ | ర్యముఁ బితృశుశ్రూషణమును మాతృ శుశ్రూషణము గురుశుశ్రూషణము నను | కంపయు గోవ్రత సంపదయును |
|
| ఆ. |
వత్స! యాచరింపవలయునట్టివి’ యని | పలుకుటయును నా నృపాలవరుఁడు ‘గో ప్రదానవిధి యకుంఠిత కృప నాకు | నెఱుఁగఁ జెప్పవే సమిద్ధబుద్ధి.’ |
003 |
| వ. | అని యడిగిన యక్కురుపతికిం గురుపితామహుం డిట్లనియె. | 004 |
| ఆ. |
‘తనియ మేసి నీరు ద్రావి మందకు వచ్చి | సౌఖ్య మెసఁగఁ బసులు శయన మొంది యుండ నచట నియతి నుండి మాంధాతృండు | పరమభక్తి నమరగురునిఁ దలఁచి. |
005 |
| వ. | ఇట్ల యడుగం గలవాఁడై కరంబులు మొగిచి బహువిధంబులం బ్రస్తుతించిన, నా పురుహూత పురోహితుండు ప్రత్యక్షం బగుటయు, న ప్పుడమిఱేఁ డమ్మహాత్ముని పాదంబులకుం బ్రణమిల్లి యడిగిన నద్దేవగురుం డన్నర దేవోత్తమున కిట్లనియె. | 006 |