| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
‘ఉదధి సుఖగోష్ఠి నున్నపు నదులతోడ | ‘మీ తటంబుల తరువులు మీరు వొంగి తఱిమిపాఱినఁ గూలు వేతసము లేల | పెఱికిపో వవి మీ కేమి ప్రియ మొనర్చె? |
86 |
| వ. | వాని నున్మూలింప మీకు శక్యంబు గామిం జేసియో వానికిం జేటు వాటిల్ల; దిది యేమి?’ యనవుడు నదులందు గంగ యిట్లనియె. | 87 |
| క. |
‘బిగు వెడలక నిలిచి పడున్ | నగములు వేతసచయంబు నమ్రంబై పె ల్లగు మా వేగము గడపి యె | సఁగు బూర్వస్థితిన బ్రదుకు సమకూరంగన్. |
88 |
| వ. | అనియె నా ప్రబ్బలిచెట్ల తెఱంగు కనికొని. | 89 |
| ఆ. |
అరి నృపాలు పెంపు నాత్మీయశక్తియు | నెఱిఁగి మూర్ఖవృత్తి నెదురుపడక యుచిత వృత్తి నతని యుద్ధతి మేవడిఁ | గడపి హీనబలుఁడు సెడక నిలుచు. |
90 |
| వ. | అనిన విని యుధిష్ఠిరుండు ‘దగుపదంబులకుఁ గులవంతు లగు పరిజనులు దొరకొనకున్న నరనాథుం డేమి సేయం గలవాఁ? డని యడిగిన నప్పుడమిఱేనికి భీష్ముం డిట్లనియె. | 91 |