| ఇతిహాసములు | మొల్ల రామాయణము | కిష్కింధాకాండము |
| సుగ్రీవునకు వానర రాజ్య పట్టాభిషేకము | ||
| క. |
తారాపతి శిక్షింపుచుఁ దారా పతి ధవళ కీర్తిఁ దగు నర్కజునిన్ దారా దేవికిఁ బురి కా తారార్కము గాఁగ రాజ తనయుఁడు నిల్పెన్. |
17 |
| క. |
నిగ్రహము మాని నృపతి శు భగ్రహ లగ్నంబునందుఁ బట్టము గట్టెన్ నిగ్రహ రాజోపగ్రహు సుగ్రీవుని, హేమదామ సుగ్రీవుఁ దగన్. |
18 |
| వ. |
ఇట్లు సుగ్రీవుని గపి రాజ్య పట్టభద్రునిం జేసి, వాలి తనూసంభవుని నంగద కుమారుని యువరాజ పదంబున నిలిపె. నంత వర్షాకాలము గడుచునంత దనుక శ్రీరాముని మాల్యవంతంబుపై నుండ నియమించి వారు సని రయ్యవసరంబున. |
19 |