| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దేవీ నీ పాదసారసములే దిక్కు |
| కాంభోజి - ఆది |
| పల్లవి: |
| దేవీ నీ పాదసారసములే దిక్కు వేరేగతియెవరమ్మా నా॥ |
| అను పల్లవి: |
| శ్రీవెలయు మధుర నెలకొన్న చిద్రూపిణి శ్రీ మీనాక్షమ్మా॥ |
| చరణము(లు): |
| అనాథరక్షకియనేటి బిరుదు నీ కనాది గదా లో కనాయకి ధరలో కృపానిధి నీకన్నా యెవరమ్మా మాయమ్మా యి కన్నాకు భవలతాలవిత్రి నాపై కటాక్షించవె వేగమే చిన్న వెతలు నీవు దీర్చి నన్ను రక్షించుటకిది మంచి సమయమమ్మ॥ |
| కదంబకానన మయూరీ నీవే కదంబా శంకరీ చం డ దానవమద ఖండితా మృడానీ శుకపాణీ కల్యాణీ సదా నీ ధ్యానముసేయువారికి గదా సామ్రాజ్యము చిదానందరూపుడైయున్న శ్రీ సదా శివుని రాణీ మధురవాణీ॥ |
| ఉమా రమా శ్యామకృష్ణనుతా గిరికుమారీ నీ సమానమెవరు బ్రోవ నీకు భారమా జగత్సాక్షీ మీనాక్షీ తామసము జేసితే నీకిది న్యాయమా ఇంత జాగేలనే? వేమారు నీపాదదర్శనము లభించి నీ మాటలు వినగ వచ్చితినమ్మా॥ |