| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| ముని యానతి శ్రీరామునిచే శివ ధనుర్భంగము | ||
| చ. |
కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు, ఫణీంద్ర భూ విషా స్పదులను బట్టు, కూర్పమ రసాతల భోగి ఢులీ కులీశులన్ వదలక పట్టు, ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్ బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁ డీశుని చాప మెక్కిడున్. |
79 |
| క. |
ఉర్వీ నందనకై రా మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం బుర్విం బట్టుఁడు దిగ్దం త్యుర్వీధర కిటి ఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్. |
80 |
| వ. | అనుచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున, | 81 |
| మ. |
ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబు చే నంది, చి వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్, దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. |
82 |
| ఆ. |
ధనువు దునిమినంత ధరణీశ సూనులు శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి, సీత మేను వంచె, శ్రీరామచంద్రుని బొగడె నపుడు జనక భూవిభుండు. |
83 |