| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | విష్ణువు ఇంద్రాదులకు నభయం బొసగుట |
| వ. | అని యాపన్నులయి విన్నవించిన వేల్పుమన్నెదొరలయెడన్ బ్రసన్నుం డయి వెన్నుం డిట్లని యానతిచ్చె | 274 |
| చం. | ఎఱుఁగుదు మున్ సుకేశుఁడు మహేశుకృపన్ విభవాభిరాముఁడౌ టెఱుఁగుదు వాని పుత్త్రకు లహీనవరంబులు బ్రహ్మ యీయఁగా మెఱసి జగత్త్రయంబునకు మీకును బాధకు లౌట సర్వ మే నెఱుఁగుదు వేల్పులార! వెత నింకకుఁ డింక జయింతు వారలన్ | 275 |
| శా. | పూర్వాదిత్యమహావిలాసము లయంబుం జెంద నస్మద్ధను ర్మౌర్వీటంకృతి గర్జ హెచ్చ సుమనోమ్లానిత్వముల్ మాన మ ద్దుర్వారాశుగవృష్టి మించి యిఁకఁ దద్దుష్టోద్యమగ్రీష్మ త ప్తోర్వీతాపముఁ బాపు నేఁగుఁడన వారుత్సాహముం బొందుచున్ | 276 |
| తే.గీ. | ఇందిరానాథ వదనారవిందగళద మందమధురవచోమకరందబిందు బృందతుందిల సుమనోమిళిందులై పు రందరాదులు సెందిరి మందిరముల | 277 |
| కం. | అని కుంభజుఁ డెఱిఁగించిన విని రాఘవుఁ డవల నెట్టి వృత్తి మెలఁగి ర ద్దనుజులు హరి వారలతో నని యెటువలెఁ జేసెఁ దెల్పుఁడని యడుగుటయున్ | 278 |