| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
శ్రీరమ్య ధర్మ నిత్య | ప్రారంభవిభాసి! రాజపరమేశ్వర! ఘో రారి మదకుంభికుంభవి | దారణదారుణకృపాణదక్షిణహస్తా! |
1 |
| (సం. 3-49-29) | ||
| వ. | అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు సాంత్వనవచనంబుల భీమసేనునకుం గోపాటోపోపశమనంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదశ్వుండను మహాముని వచ్చి విధిదృష్ట విధానంబునం బూజితుండయి విశ్రమించియున్న నమ్మునివరునకు ధర్మతనయుం డధర్మపరులయిన పరుల చేతం దమపడిన నికారప్రకారంబంతయు నెఱింగించి యిట్లనియె. | 2 |
| క. |
‘పుడమియు రాజ్యము బంధుల | విడిచి మృగావలులఁ గలసి విపినంబులలోఁ గడుకొని మా య ట్లిడుమలఁ | బడిన నృపులు గలరె యొరులు పరమమునీంద్రా!’ |
3 |
| వ. | అనిన నయ్యుధిష్ఠిరునకు బృహదశ్వుం డిట్లనియె. | 4 |
| క. |
‘దేవసములైన యనుజుల | తో విప్రులతో రథాలితో వచ్చి యర ణ్యావాసము సేసెదు ధర | ణీవల్లభ! నీవు ధర్మనిష్ఠితబుద్ధిన్. |
5 |
| క. |
నరనుతుఁడు దొల్లి నలుఁ డను | ధరణీశుఁడు జూద మాడి తన విభవము పు ష్కరుచేత నోటువడి యొ | క్కరుఁడ కరం బిడుమఁ బడఁడె కాననసీమన్. |
6 |