| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ‘ఋశ్యశృంగుం డను ముని జన్మంబును దచ్చరితంబును వినవలయు; నది యె?’ ట్లని యడిగిన రోమశుం డిట్లనియెఁ ‘దొల్లి కశ్యపపుత్త్రుండగు విభాండకుండను మునివరుం డఖండితబ్రహ్మచర్యంబునం దపంబు సేయుచు నొక్కనాఁ డొక్క మడువున నీళ్ళాడుచున్న యవసరంబున. | 87 |
| క. |
సురుచిరసురూపగుణసుం | దరి యూర్వశి యను లతాంగి తద్దర్శనగో చర యగుడు నపుడ రేత | స్ఖ్సలనం బమ్మునికి నయ్యెఁ గామకృతమునన్. |
88 |
| వ. | అయ్యమోఘవీర్యంబుతో మిశ్రం బయిన జలంబు నొక్కదుప్పిపెంటి ద్రావి గర్భంబుఁదాల్చిన నందు ఋశ్యశృంగుం డను కుమారుండు జన్మించి, తండ్రినిం, దదాశ్రమంబునుంగాని యొండెఱుంగక ఘోరతపంబు సేయుచున్నంత. | 89 |
| తే. |
బలియుఁ డంగాధిపతి రోమపాదుఁ డనఁగ | ధరణిఁ బరఁగిన వీరుండు దన పురోహి తాపరాధకృతమున బ్రాహ్మణులచేత | విడువఁబడినఁ దన్మహి కనావృష్టి యయ్యె. |
90 |
| వ. | దానికి వెఱచి యాతండు బ్రాహ్మణులఁ బరమభక్తి నుపాసించి ‘యీ యనావృష్టి దోషం బేమి కారణంబున నయ్యె? దీనికిం దగిన ప్రతీకారం బెద్ది?’ యని యడిగిన, వానికిం బ్రసన్నులై బ్రాహ్మణు లిట్లనిరి. | 91 |
| క. |
‘కడు దర్పితుఁడని నిన్నున్ | విడిచిరి బ్రాహ్మణులు; వారు విడుచుడు నమరుల్ విడిచిరి; దానన వర్షము | దడసె భవద్దేశమునకు ధరణీనాథా! |
92 |
| ఉ. |
శాంతుఁడు ఋశ్యశృంగుఁడను సన్ముని యున్నయెడన్ ధరిత్రికిన్ సంతతవర్షణం బగు భృశంబుగ; నట్టివరంబు దొల్లి వృ త్రాంతకుచే దయం బడసె నమ్ముని; గావున ఋశ్యశృంగు వే దాంతసువేది రాఁబనుపు మంగమహీశ్వర! నీదు నేర్పునన్.’ |
93 |
| వ. | అనిన విని రోమపాదుండు దన చేసిన బ్రాహ్మణావమానంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబుఁ జేసి, బ్రాహ్మణ వచనంబున నపుడ బుద్ధిమంతులతో విచారించి విదగ్ధవేశ్యాంగనలం బిలువంబంచి ‘మీనేర్చువిధంబుల ఋశ్యశృంగుం బ్రబోధించి యిటఁ దోడ్కొనిరం’ డని పంచిన. | 94 |
| క. |
ఆ వేశ్యాజను లధిక ర | సావహభక్ష్యములు విలసదనులేపన మా ల్యావళులుఁ గొనుచు నరిగిరి | నావాశ్రమమునను నమరనారులలీలన్. |
95 |
| వ. | అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దన పుత్త్రు ఋశ్యశృంగు సమర్పించి, వన్యఫలాహరణార్థంబు వనంబున కరిగిన యవసరంబున నందొక్క జరద్వేశ్య దనకూతు నభినవ యౌవన విలాస విభాసిని నమ్మునిపుత్త్రుపాలికిం బుచ్చిన, దానిం జూచి ఋశ్యశృంగుండు సంభ్రమంబున. | 96 |