| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| సీ. |
కమనీయకనకపుంఖప్రభాభాసియుఁ | దీక్ష మ్ణుఖంబును దివిజయక్ష మునిసిద్ధసాధ్యసమ్మోదావహంబు నై | విలసిల్లు బాణ మవ్వీరవరుఁడు గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియు | క్తంబుగా నొనరించి కార్ముకమున సంధించి జగములు జయపెట్టఁ జెచ్చెరఁ | దివిచి యేయుటయును దీవ్రభంగిఁ |
|
| ఆ. |
గడఁగి యాశరంబు గల్పాంతవహ్నియ | పోలెఁ బంక్తికంఠుఁ బొదివి నీఱు గా నొనర్చె సూతఘన రథరథ్య స | మన్వితముగ నొక్కమాత్రలోన. |
151 |
| వ. | అప్పు డంబరంబున దివ్యతూర్యనాదంబులు సెలంగం గలంగి యసురు లెల్లఁ దొలంగిరి; గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుఁబ్రవర్తిల్లె; నింద్రాదిదేవోత్తము లన్నరదేవోత్తముం బ్రస్తుతించుచుం బ్రమోదంబు నొందిరి. | 152 |
| క. |
ఏకోత్సవంబు లయ్యెఁ ద్రి | లోకంబులు నఖిలలోకలుంటాకుఁడు ఘో రాకారుఁడు దశవదనుఁడు | గాకుత్స్థనిశాతశరముఖంబునఁ బడినన్. |
153 |
| ఉ. |
అంత ననంతకీర్తి శరణాగతరక్షణశాలి రాఘవుం డెంతయు వేడ్కతోడ నసురేంద్రుపదంబున నవ్విభీషణున్ సంతతపుణ్యుఁ బుణ్యజనసంతతివర్ధనుఁ గట్టెఁ బట్ట మ త్యంతదయాంతరంగుఁడు గృతాహితభంగుఁడు దానుఁ దమ్ముఁడున్. |
154 |
| వ. | తదనంతరంబ యవింధ్యుండు విభీషణసహితుండై జానకి నుచితయానంబున నునిచికొని రామదేవు పాలికిం దెచ్చి ‘దేవా! దేవిం బరిగ్రహింపు’ మని విన్నవించిన నతండు. | 155 |
| చ. |
అతిమలినాంగి జీర్ణమలినాంబరధారిణి సంతతాశ్రుపం కితవిలసత్కపోలఁ బరికీర్ణజటాయితకేశభార నా యతఘనదుఃఖదూషితఁ బ్రియాంగనఁ గన్గొని యప్రియాత్ముఁడై నుతచరితుండు దద్దయు మనోవ్యథ సేయుచు నింతి కిట్లనున్. |
156 |
| సీ. |
‘అధికదుష్టాచారుఁ డైన దశాననుఁ | డింతకాలము తనయింటఁ బెట్టి కొనియున్న నిన్నుఁ గైకొనిన నస్మచ్చరి | త్రమునకుఁ దొడరదే ధర్మహాని? పరిభవంబునకునై ప్రతికారముగ వైరిఁ | గూల్చితిఁ గాని నీకొఱకుఁ గాదు; మెలఁత! నీ చరితంబు మేలైనఁ గీడైనఁ | గానిమ్ము, నిన్ను నిక్కముగ నొల్లఁ; |
|
| ఆ. |
బరఁగఁ గుక్కవాతఁ బడిన హవ్యముభంగి | యయ్యె నీ తెఱంగు నరయ నిపుడు; గాన యిచటఁ దడయఁ గాదు; చెచ్చెర నీకు | నిష్టమయిన యెడకు నేఁగు మతివ!’ |
157 |
| ఆ. |
అనినఁ జెవులఁ గొఱవి గొని చూఁడినట్లైనఁ | దాల్మి పెల్లగిల్లఁ దరళనయన మొదలు నఱక నొఱగు కదళిచందంబున | నెలఁత దల్లడమున నేల వ్రాలె. |
158 |
| క. |
వెఱఁగుపడి హర్షరాగము | తఱిఁగిన వెలువెల్లనై వదనములు వ్రాలం దెఱఁగేది ఱిచ్చపడి ర | త్తఱిఁ దత్పరిజనము లెల్లఁ దద్దయు వంతన్. |
159 |
| తే. |
పడఁతి యల్లన మఱికొంతవడికిఁ దెలిసి | యలసమూర్తియై దందడి నశ్రు లురులఁ గేలు ముకుళించి వసుమతీపాలుఁ జూచి | యెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్టు లనియె. |
160 |
| క. |
‘నినుఁ గీడు వొరయకుండఁగ, | జనులకు నా నిక్క మెక్క జననాయక! యే ననలంబుఁ జొచ్చి వెడలెదఁ; | గనుగొను; మిచ్చనవు నాకుఁ గరుణింపు దగన్. |
161 |
| ఉ. |
నాదగుబుద్ధి నీదు చరణస్మరణంబ యొనర్చుఁ గాని యొం డేదియు నెన్నఁడుం దలఁప; దిట్టిద; యొండొకచందమైన ని మ్మేదినియుం గృశానుఁడు సమీరుఁడు శీతకరుండు నర్కుఁడుం గా దన కీక్షణంబ ననుఁ గాల్పరె; వేల్పులు చెట్ట సైతురే?’ |
162 |
| వ. | అని పలుకుటయు నప్పుడు పృథివ్యాదిభూతంబు లెలుంగులు సెలంగ నెల్లవారును వినం దమదమ నామంబు లెఱింగించి యి ట్లనిరి. | 163 |
| క. |
‘విను ముత్తమురాలు సుమీ | జననాయక! జనకతనయ; సందేహపడం బనిలేదు మాకుఁ దెల్లము; | జనులకు మము మొఱఁగరాదు సకలక్రియలన్. |
164 |
| వ. | అనిన యనంతరంబ సకలసురముని గణసహితంబుగాఁ బితామహుండు సనుదెంచి రాఘవుచేత సత్కృతుం డై యిట్లనియె: ‘నయ్యా! నీవు సకలభూతదుస్సహుండైన రావణుం బరిమార్చి లోకహితంబు సేసితివి; వినుము! నలకూబరుశాపంబునంజేసి దశగ్రీవునకుఁ బరస్త్రీలయందు బలాత్కారంబు సెల్లదు; గావున నీధర్మపత్నియం దొక్క దురితంబును బొరయదు; నీవు నిర్విచారుండ వై యిప్పతివ్రతం బరిగ్రహించి నెమ్మదిఁ బురంబున కరుగు’ మని పలికి, యతనికిఁ బ్రియంబుగాఁ దత్సమరనిహతు లైన వానరులఁ బ్రాప్తజీవులం జేసి పరమేష్ఠి సనియెఁ; బురందరసారథియును దాశరథి వీడ్కొని హరిసహస్రయుక్తం బైన రథంబు గొని నాకలోకంబున కరిగె; నంత. | 165 |
| మ. |
అవిరోధంబుగ జానకీసహితుఁడై యాబద్ధరత్నప్రభా నవపుష్పంబగు పుష్పకం బను విమానం బెక్కి యర్కాన్వయ ప్రవరుం డిమ్ముల నేఁగె సమ్మదభరప్రాగ్భాగవారాకర ప్లవమానుం డగుచుం బురంబునకుఁ బ్రాప్తశ్రీవిశేషోన్నతిన్. |
166 |
| వ. | ఇ ట్లరిగి భరతాదిబంధుజనంబులు నఖిలపరిజనంబులు నభినందింప వసిష్ఠవామదేవవిహితం బయిన యభిషేకశోభనంబు వహించి రాముండు సుగ్రీవవిభీషణాది సుహృజ్జనంబులం బ్రకటబహుమానవిశేషంబుల నాదరించి వీడ్కొలిపి, యభిమతభోగంబుల నిరంతరత్యాగంబులఁ బ్రభూతయాగంబులఁ బ్రసిద్ధుం డయి బహుసహస్రసంవత్సరంబులు వసుమతీరక్షణం బొనర్చె; నిది రాఘవుచరిత్రంబు. | 167 |
| ఉ. |
వారక యిట్లు పూని వనవాసనిరంతర దుఃఖమున్ మహా వైరికృతాపకారదురవస్థయు నోర్చి శుభంబు నొందఁడే యారఘురాముఁ; డట్లు వసుధాధిప! నీవును దుఃఖ మింతయున్ సైరణ నోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్. |
168 |
| వ. | అని చెప్పిన విని యుధిష్ఠిరుండు రాముని పరాక్రమవిశేషంబు గొనియాడి, ‘జానకి పాతివ్రత్యమహిమ యింత యొప్పునే!’ యని పలికి, ‘మునీంద్రా!, పతిభక్తితాత్పర్యంబున నఖిలదుఃఖంబులు నోర్చి శుభంబు నొందిన పుణ్యసతిచరిత్రంబు వినవలతుం జెప్పవే!’ యనిన నతనికి మార్కండేయుండు ‘సావిత్రి యను రాజపుత్త్రిచరిత్రంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బగు’ నని యిట్లనియె. | 169 |