పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
సక్తుప్రస్థచరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట (సం. 14-92-5)
సీ. ఒక్కబిలంబుననుండి వెల్వడి యొక్క | నకులంబు విప్రజనంబు నడుమ
నిలిచి ‘సక్తుప్రస్థు నలఘు ధర్మంబు నే | మియుఁ బోల దీ యశ్వమేధ’ మనిన
నవ్విప్రు లతివిస్మయంబంది యమ్ముంగిఁ | గనుఁగొని ‘మంత్రవర్తనముఁ దంత్ర
గమనికయును వివిధములైన దాన వి | ధులు బహుళ త్యాగములును లోక
 
తే. సంస్తుతము లయ్యె; భక్తియు శ్రద్ధయును బ్రి | యంబు వినయంబు సురముని హర్ష మావ
హిల్లఁ జేసె; నీ వేమిట నిమ్మహాధ్వ | రంబుఁ గీ డంటి; చెప్పుమ! ప్రస్ఫుటముగ!’
218
వ. అనుటయు నన్నకులంబు వారల కిట్లనియె. 219
సీ. ‘వినుఁడు ధర్మక్షేత్ర మన రూఢమైన కు | రుక్షేత్రమునయందు రోషకామ
విరహితుం డొక మహాద్విజుఁ డుంఛవృత్తిమై | నుండు; భార్యయుఁ దనయుండు నతని
పత్నియు సహచరభావంబు నొంది వ | ర్తింతు; రట్టులు తపశ్శ్రీ వెలుంగ
నున్నెడఁ బులుపంట లన్నియు నత్యంత | వికలంబుగా ననావృష్టిదోష
 
తే. మావహిల్లిన నతని కాహార మొనరఁ | జేసికొనుట దుర్ఘటమయి చెల్లుచుండఁ
దారు నలువురుఁ జని తృణధాన్య మల్ప | మేఱికొనివత్తు; రాఁకలి దీఱకుండు.
220
వ. అట్టియెడ నొక్కనాఁ డయ్యందఱును రేపు దొడంగి పడమటి జామునకు వెదకి తెచ్చిన పూరి కొలుచు ప్రస్థమాత్రంబు సక్తు వయ్యెం; గర్తవ్యానుష్ఠానంబులు నడపి యనంతరంబ యాకుంచెఁడు పేలపిండియుఁ జెఱిమానెండుగా నలువురును సమంబుగాఁ బంచికొని యుపయోగించువారై యున్న సమయంబున. 221
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )