| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| మ. |
భ్రుకుటిస్ఫూర్జిత ఫాలభాగుఁ డగుచుం బొంగారి, యాసూతపౌ త్రకు కోదండము బాహుదండములుఁ జిత్రస్ఫూర్తిఁ దున్మాడి, మ స్తక ముగ్రోద్ధతిఁ గ్రూరభల్ల విలస ద్ధారాహతిం ద్రుంచె, బా ణకళాదుర్దముఁ డన్నరుండు పతియు న్రాధేయుఁడుం జూడఁగన్. |
246 |
| వ. | ఇ వ్విధంబున వృషసేను సమయించుటం జూచి, కర్ణుండు శోకవ్యాకులచిత్తుండై కన్నీ రొలుకం, గోపాటోపంబున నుద్భటుం డగుచు, నమ్మహారథుని తేరికి సమ్ముఖంబుగాఁ దనయరదంబు వఱపించి, ‘యర్జున! యర్జున!’ యని యాహ్వానంబు సేసిన; నతండును సవిశేషోత్సాహంబునం బొదలి యడరె; నట్టియెడ దురంబు దక్కి యిరువాఁగునుం బరమ కౌతుకంబునం గనుంగొనుచుండ నయ్యిరువురు రామసన్నిభంబులు నాదిత్య సంకాశంబులుఁ ద్రినయన ప్రతిమంబులు నగు నాకారంబుల నుల్లసిల్లిరి; వారల యెక్కటి కయ్యం బాలోకించు కుతూహలంబున సుర పితృ విద్యాధర సంయమి సంఘంబులును శచీపతి ప్రజాపతి పశుపతులును లోనుగా ననేక దివ్యు లేతెంచి నభోభాగంబున నిలిచి; రప్పుడు బ్రహ్మ రుద్రున కిట్లనియె. | 247 |