| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - పంచమాశ్వాసము |
| క. |
పులిఁ గోల వేసిన ట్టి | ట్టలపు రయంబునఁ గడంగుటయుఁ దద్వక్షః స్థలమునఁ గిరీటి రెండ | మ్ముల నాఁటఁగ నేసె బొమలు ముడివడుచుండన్. |
188 |
| క. |
క్షతములఁ బెల్లు దొరఁగు శో | ణిత ధారలు మదముగా వినిర్గళకరి యా కృతిఁ గవిసి యతం డేసెను | శతమఖసుతు ఫాలతలము శాతశరమునన్. |
189 |
| తే. |
రక్తధారలు వెడలంగ రశ్మి వెలుఁగఁ | బొలుచు బాలార్కు చాడ్పునఁ జెలువు మిగిలి ఫల్గునుండు ప్రతాప సంభరిత మూర్తి | యగుచు శరకిరణంబులు నిగుడఁ జేసె. |
190 |
| శా. |
వానిం దీవ్రశరంబులం దునిమి గర్వం బెక్క నానాస్త్ర సం తానంబుల్ గురిసెన్ సుయోధనుఁడు దుర్దాంతాకృతిన్ గోత్రభి త్సూనుండుం బటు సాయకోత్కరమునం జూపెన్ భుజాటోప మి ట్లేనుం గేనుఁగుఁ దాఁకునట్లు సమరం బేపారఁగా నయ్యెడన్. |
191 |
| తే. |
హస్తిపురిఁ బేరు గల మదహస్తి నెక్కి | క్రాలు కావలి రథములు గవియుఁదేర నభ్రగజముపైఁ బర్జన్యుఁ డనఁగ నంప | వాన పరఁగ వికర్ణుండు వచ్చి తాఁకె. |
192 |
| ఉ. |
వీఁక నెదిర్చి యిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్చుచుం దాఁకినఁ గ్రోధవేగ సముదగ్రత నెఱ్ఱని చూడ్కిఁ జూచి పే రాఁకలితోడ నున్న జమునాకృతి భీషణరేఖ యొప్పఁగా వ్రేఁకని నారసంబుఁ దొడి క్రీడి కరిన్ దృఢముష్టి నేసినన్. |
193 |
| ఆ. |
ఫాలకుంభ సంధిఁ బడి వాలమున వెస | నుచ్చి పోవుటయును నుర్వి యద్రువఁ గూలె నగ్గజంబు కులిశ చండాహతిఁ | బడు మహానగంబు భంగి దోఁప. |
194 |
| క. |
అరుణ మణి మాలికా వి | స్ఫురణంబున దంతితనువు చూడఁగ నొప్పెన్ ధరణిఁ బడియున్న బహుముఖ | పరిగత దావాగ్నిఁ బొల్చు పర్వతము క్రియన్. |
195 |
| వ. | ఇవ్విధంబున నేనుంగు పీనుంగైన వికర్ణుండు వెఱ చఱచి పఱచి వివింశతిరథం బెక్కె; నాలోనన యట్టి నారాచంబున రారాజు నురంబు నోనాట నేసినఁ గరీంద్రుండు వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని ఱిచ్చపడు రథికుల వివ్వచ్చుం డనర్గళ ప్రసారం బగు మార్గణాసారంబున ముంచిన వెగడుపడి విఱిగి పాఱి; రిత్తెఱంగునఁ దనచుట్టును బయలైన నయ్యురగకేతనుండును మరలె; నిట్లు దొరయును విఱిగి కలను వాసి కాలు ద్రోసిపోవుటయు, నతిరథ మహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి సైన్యంబు లున్నవి యున్నచోటన తెరలి కనుకనిం బఱవం దొడంగిన. | 196 |
| తే. |
యూథపతితోడి దంతిసముత్కరంబు | వెనుకఁ దగిలెడు సింగంబు విధము దోఁప నార్పు నాదంబుగా నరుఁ డంటఁ దాఁకె | రాజుఁ దారును బాఱెడు రథిక వరుల. |
197 |
| క. |
వెనుకొని కర్ణుని పెడతల | యును దుశ్శాసనుని వీఁపు నొక్కొక్క శరం బున నేసె నప్పు డయ్యిన | తనయుం డిట్లనియె నతిరథశ్రేష్ఠులతోన్. |
198 |
| ఆ. |
‘కూడముట్టెఁ గ్రీడి కురువంశమున కెల్ల | మూలకంద మీ నృపాలుఁ డితని నిచటఁ గాచికొనుట యెల్ల పౌరుషములు | జేఁత; నిలిచి లావు సేయవలయు. |
199 |
| క. |
అన వినుచుఁ గురుపితామహుఁ | డును ద్రోణుఁడు ద్రోణపుత్రుఁడును గృపుఁడును గ ర్ణుని మాట సరకుసేయక | చనుచుండఁగ దీనవృత్తి జనపతి పలికెన్. |
200 |
| క. |
‘లోకంబు తోడివారుగ | మీకుం జనునయ్య? మగఁటిమికి గుఱిగాదే నా కెడరైన యెడం దగఁ | జేకొని యది మీరు చక్కఁ జేయుట యరయన్.’ |
201 |
| వ. | అనిన విని వారలు వెనుకయై యాశ్వాస వచనంబులు పలుకుచుం బోవం బోవుచున్న యన్నరేంద్రు నెలుంగెత్తి పిలిచి పార్థుం డిట్లనియె. | 202 |