| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| కృష్ణుఁ డర్జునుని రైవత పర్వతమున నిలుపుట | ||
| ఉ. |
గ్రుచ్చి కవుంగిలించుకొని, కూరిమితోఁ గుశలంబు వేఁడి, తా వచ్చిన రాక లోఁ దెలిసి, "ద్వారక రైవతకాద్రి పొంతనే, యిచ్చటికిన్ సమీప" మని కృష్ణుఁడు తెల్పుచుఁ, దోడితేరఁగా వచ్చె రథంబుపై నపుడు వాసవి వేసవి యేఁగునంతటన్ |
86 |
| తే. |
వచ్చి రైవతకారామ వాటి నిల్చి కృష్ణుఁ డం దిష్ట గోష్ఠి నా రేయి కడపి "యిచట నుండుము, తావకాభీష్ట మిపుడు చేయుదు" నటంచుఁ బైతృష్వసేయు నిలిపి |
87 |